Header Banner

ఆస్ట్రేలియాలో వరద బీభత్సం! 50,000 మంది బాహ్య ప్రపంచంతో.. ప్రధాని అల్బనీస్ పర్యటన!

  Fri May 23, 2025 21:23        Australia

ఆస్ట్రేలియా ఆగ్నేయ ప్రాంతాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించింది. శుక్రవారం నాడు వరద నీటిలో చిక్కుకున్న ఓ కారులో ఒక వ్యక్తి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఈ ప్రకృతి వైపరీత్యంలో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఈ వారం ఆరంభం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సిడ్నీకి సుమారు 550 కిలోమీటర్ల దూరంలోని కాఫ్స్ హార్బర్ సమీపంలో ఈ మృతదేహం లభ్యమైంది. వరదల కారణంగా దాదాపు 50,000 మంది ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి, జలదిగ్బంధంలో చిక్కుకున్నారని అత్యవసర సేవల సిబ్బంది తెలిపారు. వరద తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో ఇళ్లకు తిరిగి వెళ్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. "వరద నీటిలో అనేక కాలుష్య కారకాలు ఉంటాయి. ఎలుకలు, పాములు వంటి విష పురుగులు కూడా చేరే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఈ ప్రమాదాలను అంచనా వేసుకోవాలి. విద్యుత్ సరఫరా కూడా ప్రమాదకరంగా మారవచ్చు" అని రాష్ట్ర అత్యవసర సేవల ఉప కమిషనర్ డేమియన్ జాన్‌స్టన్ మీడియా సమావేశంలో వివరించారు.

 

ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో తెలుగుదేశం నేత ఇంట తీవ్ర విషాదం! ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న తెలుగు వారు!

 

ఆస్ట్రేలియాలోని అత్యధిక జనాభా కలిగిన న్యూసౌత్‌వేల్స్‌ రాష్ట్రంలోని హంటర్, మిడ్ నార్త్ కోస్ట్ ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహించడంతో అనేక కూడళ్లు, రహదారి సూచికలు నీట మునిగాయి. కార్లు విండ్‌షీల్డ్ ల వరకు నీటిలో మునిగిపోయిన దృశ్యాలు టెలివిజన్లలో ప్రసారమయ్యాయి. చెత్తాచెదారం, చనిపోయిన పశువులు వరదతో పాటు తీర ప్రాంతాలకు కొట్టుకువస్తున్నాయి. వరద తీవ్రత అధికంగా ఉన్న టారీ పట్టణంలో తాను చేపట్టాల్సిన పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. హంటర్ ప్రాంతంలోని మైట్‌లాండ్ పట్టణం నుంచి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, "ఈ పరిస్థితి నివారించడానికి మేము ప్రయత్నించాం... కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల అది సాధ్యపడలేదు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ప్రస్తుతం బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన కమ్యూనిటీల గురించే మా ఆలోచన. మీరు ఒంటరి కారని మేం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం" అని అన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! రూట్ లోనే ఫిక్స్ - నేషనల్ హైవేకు దగ్గరగా.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Australia #RoadAccident #BusAndCar #SydneyHills